Friday, March 20, 2009

ఆడబతుకు అడవిలోకూడా అన్దతుకె

ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని అంటూఉంటారు.మరి అడవిలోనే పుట్టిన ఆడవాళ్ళ భాధలుఇంకెంత ధారుణంగా ఉన్నాయో కాస్త పరికించండి. తైల సంస్కారమంటే ఏమిటో ఏమో తెలియని జుట్టు,శుచి,శుబ్రత ఎరగని ఒళ్ళు,కాకి పీకడానికి కూడా లేని కండ,ఉతుకు లేని ఉడుపులు ఇది నల్లమలలో నివశించే చెంచు మహిళ ఆకారాధి విశేషాలు.ఇంతటి దీన స్థితిలో ఉన్న చెంచు మహిళ పట్ల కూడా కొందరికి కోరిక కలగడం పైశాచకత్వం కాక మరేమిటి.నాగరికులని పిలువబడే చెంచులు ఎప్పుడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన చరిత్రలేదు. కాని నాగరికులమని జబ్బలు చరుచుకునే వారెందరో చెంచు మహిళలపై పాల్పడిన అత్యాచారాలు అన్నిఇన్ని కావు. అందమైన నల్లమల ప్రాత:సంధ్యా సౌందర్యాన్ని తన హాండీకాంలో చిత్రిస్తున్నాడో సౌందర్యారాధకుడు. ఓపొద చాటున అలజడేదో వ్యూపైండర్ లో అతనికి కనిపించింది.జాగ్రత్తగా చూస్తే బక్క చిక్కిన ఓ చెంచు మహిళను సాయుధుడొకడు బెదిరిస్తూ పొదచాటుకు తీసుకు వెల్తున్న దృశ్యం అతడి కంట పడింది. చెట్టుపై ఉన్న తను కెమెరాను మరింత ఝూం చేసి పులిలా వేటాడి లేడిని పీక్కుతింటున్నట్లున్న ఆభీభత్స దృశ్యాన్ని ఆసాంతం జాగ్రత్తగా చిత్రీకరించాడు.మావోయిస్టుల ఏరివేతకోసం అడవిలోకి వచ్చిన గ్రేహౌండు కూంబింగ్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ ఘాతుకం అలా రికార్డ్ చేయబడింది. నలమలలోని పెచ్చెరువు చెంచు గూడెం పరిసరాల్లో జరిగిన యదార్థ సంఘటన ఇది.ఇంతటి ఘోరానికి సాక్షి అయిన వ్యక్తి ఓ స్వచ్చంద సంస్థకు చెందిన వైద్యుడు.అతడు తన మిత్రుడైన ఓ ప్రముఖ చానల్ విలేఖరి ద్వారా అప్పటి నంద్యాల osd కి తన సజీవ సాక్ష్యాన్ని అమ్ముకోవడం జరిగింది. కర్నూలు లో ప్రజాశక్తిలో పనిచేసిన ఓ మహిళా విలేకరికి ఈవిషయాలు కర్ణాకర్ణిగా తెలిసి విషయ సేకరణకు ఈ బ్లాగరుతో కలిసి ప్రయత్నించినా సాధ్యపడలేదు. అలా నల్లమల చెంచు మహిళపై ఓమానవ మృగం చేసిన అత్యాచారం వెలుగులోకి రాకుండా పూడ్చిపెట్టబడింది.ఇలాంటిదే మరో సంఘటన ప్రకాశం జిల్లా పరిధిలోని బందంభావి చెంచు గూడెంలోజరిగింది. అటవీ ఫలసాయం సేకరణ కోసం ఓ చెంచు దంపతులు అడవిలోకి వెల్లారు. అక్కడ వీరికి కూంబింగ్ పోలీసులు తారసపడ్డారు. వారు ఆచెంచు మిధునాన్నిఅన్నల జాడకోసం చిత్రహింసల పాలు చేశారు.ఆపై ఆ చెంచితను భర్తముందే సామూహిక మానభంగం చేశారు. కొసప్రాణాలతో బయటబడ్డ వారు గట్టిగా రోధించే సాహసం కూడా చేయలేక పోయారు. అయినప్పటికి విషయం ఆనోటా ఈనోటా పడి బాహ్య ప్రపంచం దృష్టిలో పడింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజా సంఘాలపై గిరిజనులను అవమానపరచారంటూ పోలీసులూ ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తిరుగమళ్ళ కేసులు నమోదుచేయడం ఓ విడ్డూరం. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో వుండే చెంచు గూడెం నాగలూటి. అక్కడికి వెంకటాపురం గ్రామం సమీపంలోనిదే. ఈగ్రామానికి చెందిన రమణారెడ్డి అనే యువకుడు ఓరోజు నాటిసారా తాగడానికి చెంచు గూడెం వెళ్ళాడు. ఫూటుగాతాగిన రమణారెడ్డి ఉఛ్ఛం నీచం మరచి 50సంవత్సరాల చెంచు పోతమ్మను దారుణంగా మానభంగం చేశాడు. ఆ సమయంలో పొతమ్మ పక్షవాతం వల్ల ఒక కాలు,చేయి పనిచేయై స్థితిలో గుడిసెలో పడిపోయి వుంది. అప్పట్లో ఆంద్రప్రధేశ్ పౌరహక్కుల సంఘం క్రియాశీలంగా వ్యవహరించడంతో పోలీసులు కేసునమోదు చేసి రమణారెడ్డిని జైలుకంపారు. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం కూడా ఇచ్చింది. నల్లమల అడవిపుత్రికలు ఇలా మగమృగాల భారిన పడుతూనే ఉన్నారు. పైన ప్రస్తావించినవి మచ్చుకు కొన్ని మాత్రమే.

Friday, March 6, 2009

ప్రశ్నించిన వాడికి అంతిమ సంస్కారంపట్టించుకోని వాడికి అకాడమీ పురస్కారం

ఇది నిజం. ఇది కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనిపిస్తూ వినపడు తున్నచరిత్ర సవ్వడి .

’కరువు దెబ్బకు ఆకలి చావులతో పిట్టల్లా రాలిపోతున్నఅడవి బిడ్డలను ఆదుకునే భాద్యత నీది కాదా’ అని ఆ అధికారిని ధిక్కారంగా ప్రశ్నించిందొక స్వరం. ’మాపేరుతో కోట్లు బొక్కి తింటున్నారు.. చావుబతుకుల మద్య ఉన్నమావాల్లకు పిడికెడు బువ్వ పెట్టేందుకు కూడా మీకు మనసు రాదా..’ ఆవేదనను ద్వనించిందొక అడవి కోయిల.మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని భాద్యత గల ఆఅధికారి పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు. తను పుట్టిన జాతిపట్ల అధికారి చూపిన నిర్లక్షం ఆచెంచు యువకుడి కడుపు మండించింది.తనతోటి మనుషుల పట్ల పౌర సమాజం ఎందుకింత భాద్యతారాహిత్యంగా వుంటుందో అర్థంచేసుకునే ప్రయత్నం చేశాడు అక్కడి మరో యువకుడు. పై సంఘటణ జరిగి నేటికి సుమారు ఎనిమిది సంవత్సరాలైయింది. నాలుగు రోజుల కిందట కేంద్రప్రభుత్వం ప్రముఖ సాహితివేత్త వాడ్రేవు చినవీరభధ్రుడు రాసిన ఓ రచనకు సాహిత్య అకాడమి అవార్డు ప్రధానం చేసింది. ఆయన ఎవరో కాదు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ITDA)ప్రాజెక్ట్ అధికారి. పైన పేర్కొన్న సఘటన జరిగిన సంధర్బంలో పట్టించుకోని అధికారి ఆయనే. శ్రీశైలంలో ITDA కార్యాలయం ముందు వేయి మంది కరువు పీడిత చెంచుల సమక్షంలో వీరబద్రుడును ప్రశ్నించిన యువకులు ఒకరు చెంచు దాసరి కొడన్నకాగా,మరొకరు చెంచుల పట్ల సామాజిక భాద్యతను పాటించిన మైదాన ప్రాంత యువకుడు గొల్ల ఆంజనేయులు. వీరిరువురు ప్రస్తుతం బతికిలేరు. వారు బతకడమ్ చాతకాని వారేమి కాదు,వారిని బతకనీయకూడదని రాజ్యం భావించింది.నల్లమలలో రెండు వేరువేరు సంఘటన్లలో వారిరువురిని రాజ్యం ఎన్ కౌంటర్ పేరిట హత్య చేసింది. వరస కరువులతో అన్నదాతలైన రైతులే అల్లాడి పోతూ వుంటే ప్రతి రోజు అడవిన పడి తిరిగి ఆహారసేకరణ చేసుకునే నలమల చెంచుల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది.ఎవరో ఒకరు ఆదుకోక పోతే వారికి ఆకలిచావులు తప్పని పరిస్థితి. దీంతో అప్పటికే రైతు కూలి ఉద్యమాలలో తలమునకలై ఉన్న చదువుకున్న యువకుడు అంజనేయులు,నిత్యం తనజాతి జనులను ఎలా కాపాడు కోవాలా అని ఆలోచిస్తూ ఉండె దాసరి చెంచు కొడన్నలు మరికొందరు ప్రగతిశీల యువకులతో కలిసి శ్రీశైలంలోని ITDA కార్యాలయం ముందు ధర్నా చేసి చెంచుల సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు పోవాలనుకున్నారు.ఈ కార్యక్రమానికి కనీసం వేయి మందిబాధిత చెంచులను తరలించాలని భావించారు. అంతా అనుకున్నట్లే జరిగింది.అగ్నిగుండంలా మండుతున్న ఏప్రియల్ నెల సూర్య ప్రతాపానికి మగ్గిపోతున్న చెంచులతో మాట్లాడడానికి పరమ మానవతావాదిగా సాహితీ ప్రపంచంలో పేరొందిన వీరభద్రుడికి మనస్కరించలేదు.ఎట్టకేలకు చెంచుల పోరాట పటిమకు వీరభద్రుడు దిగివచ్చాడు. తనరచనలలో అపారమైన మానవీయతను గిరిజనుల పట్ల చూపించే ఆయన వారి సమస్యలు వినలేదు సరికదాకూడా ఏకవచన,దూషన పదజాలంతో కించపరచాడు.ప్రభుత్వ గిరిజన స్టోరు డీలరువై ఉండిఇలాచేస్తావా అంటూ తాను మరచిన భాద్యతను కొండన్నకు గుర్తుచేశాడు. కొండల్లోని చెంచుల తరఫున మాట్లాడడానికి గ్రామానికి చెందిన నీకేం అర్హత ఉందంటూ ఆంజనేయులును బెదరగొట్టాడు.ఎన్నిచెప్పినా చెంచుల్కు సాయంచేయడానికి ససేమిరా అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. అలా ఆనాడు ప్రజల సొమ్ముతో బతుకుతూ వారి సంక్షేమం పట్ల ఏమాత్రం భాద్యత పడని వీరభద్రుడికి సాహిత్యంలో మానవీయ విలువలను పాదుకొల్పినందుకు కేద్రప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డ్ ఇవ్వడం రాజ్యం మానవత్వం మీద వేసిన క్శూరమైన జోకు. ఇలా చెంచుల భాధలకు స్పందించిన కొడన్న, అంజనేయులులు పోలీసుతూటలకు బలి కాగా,బాద్యత మరచిన వీరభద్రుడికి అకాడమి పురస్కారం లభిందడం కుళ్ళిన సమాజపు కంపును ప్రదర్సిస్తోంది